పదవ తరగతి ఫలితాలలో విజయభేరి మ్రోగించిన కుప్పం పబ్లిక్ స్కూల్ విద్యార్థులు.
పదవ తరగతి ఫలితాలలో విజయభేరి మ్రోగించిన కుప్పం పబ్లిక్ స్కూల్ విద్యార్థులు.
10 వ తరగతి 2026 ఫలితాలలో కుప్పం పబ్లిక్ స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులతో ప్రభంజనం సృష్టించారు. పెద్దమల్లు లక్ష్మి ఈశ్వర్ చంద్ రెడ్డి ( H.T NO. 2620114842) 592/600 మార్కులతో ప్రథమ స్థానం, అనహిత షిజో ( H.T NO. 2620113905) 590/600 మార్కులతో ద్వితీయ స్థానం, సి.చరణ్ కుమార్ ( H.T NO. 2620114552) 582/600 మార్కులతో తృతీయ స్థానం సాధించారు. 31 మంది విద్యార్థులు 500 లకు పైన మార్కులు సాధించారు. వీరిలో 19 మంది 550 పైన మార్కులు సాధించారు. మిగిలిన వారు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. సబ్జెక్ట్ పరంగా తెలుగు 100/100 ఇద్దరు, హింది 100/100 నలుగురు, గణితం 100/100 ఇద్దరు, సైన్స్ 100/100 ఒకరు, సోషియల్ 100/100 ఒకరు సాధించారు.
ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను పాఠశాల ఛైర్ పర్సన్ శ్రీమతి యన్. శాంతా నాగరాజ్ గారు, బి సి యన్ విద్యా సంస్థల సెక్రటరీ సాగర్ రాజ్ గారు, ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి దమయంతి గారు అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.