BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

పెదవేగిలో కొత్త ఆయిల్ ఫెడ్ కర్మాగారం నిర్మించాలి.. రైతుల సమస్యలు పరిష్కరించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:45 PM
11 వీక్షణలు

ఏలూరు, జూన్ 26:

పెదవేగిలో అత్యాధునిక సాంకేతికతతో కొత్త ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని నిర్మించాలని, ఓఈఆర్ (ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేటు) పేరుతో ఆయిల్ పామ్ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఏలూరులోని ఉద్దరాజు రామం భవనంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరిగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభల్లో ఆయిల్ పామ్ రైతుల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించి తీర్మానం చేయనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన 20.5 శాతం ఓఈఆర్ను తగ్గించి 17.5 శాతానికి పరిమితం చేయాలని ఆయిల్ పామ్ కంపెనీలు కోర్టును ఆశ్రయించడం రైతు వ్యతిరేక చర్య అని ఆయన విమర్శించారు. రైతులకు వ్యతిరేకంగా కంపెనీలు ఏకమై కోర్టుకు వెళ్లడం సమంజసం కాదన్నారు.

ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని, రైతులకు మద్దతుగా ప్రభుత్వాలే కోర్టులో పోరాడాలని కోరారు. రైతులు కోర్టులో ఇంప్లీడ్ అయ్యేందుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వాలే భరించాలని సూచించారు.

ఓఈఆర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే పెదవేగిలో ఆధునిక సాంకేతికతతో కొత్త ఆయిల్ ఫెడ్ కర్మాగారం ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన అనుమతులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం లాభాల్లో ఉన్న పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని విక్రయించే ప్రయత్నాలు సరికావని, గతంలో రైతుల ఐక్యతతో ప్రైవేటీకరణను అడ్డుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అలాగే రైతులకు అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన ఆయిల్ పామ్ మొక్కలను అందుబాటులోకి