BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

పెదవేగిలో కొత్త ఆయిల్ ఫెడ్ కర్మాగారం నిర్మించాలి.. రైతుల సమస్యలు పరిష్కరించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:45 PM
35 వీక్షణలు

ఏలూరు, జూన్ 26:

పెదవేగిలో అత్యాధునిక సాంకేతికతతో కొత్త ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని నిర్మించాలని, ఓఈఆర్ (ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేటు) పేరుతో ఆయిల్ పామ్ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఏలూరులోని ఉద్దరాజు రామం భవనంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరిగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభల్లో ఆయిల్ పామ్ రైతుల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించి తీర్మానం చేయనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన 20.5 శాతం ఓఈఆర్ను తగ్గించి 17.5 శాతానికి పరిమితం చేయాలని ఆయిల్ పామ్ కంపెనీలు కోర్టును ఆశ్రయించడం రైతు వ్యతిరేక చర్య అని ఆయన విమర్శించారు. రైతులకు వ్యతిరేకంగా కంపెనీలు ఏకమై కోర్టుకు వెళ్లడం సమంజసం కాదన్నారు.

ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని, రైతులకు మద్దతుగా ప్రభుత్వాలే కోర్టులో పోరాడాలని కోరారు. రైతులు కోర్టులో ఇంప్లీడ్ అయ్యేందుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వాలే భరించాలని సూచించారు.

ఓఈఆర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే పెదవేగిలో ఆధునిక సాంకేతికతతో కొత్త ఆయిల్ ఫెడ్ కర్మాగారం ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన అనుమతులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం లాభాల్లో ఉన్న పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని విక్రయించే ప్రయత్నాలు సరికావని, గతంలో రైతుల ఐక్యతతో ప్రైవేటీకరణను అడ్డుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అలాగే రైతులకు అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన ఆయిల్ పామ్ మొక్కలను అందుబాటులోకి