www.ntodaynews.com
పెన్షన్ కోసం సచివాలయం వద్ద పడిగాపులు కాస్తున్న వృద్ధులు
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం మండలం: జీ ఉమ్మడివరం గ్రామ సచివాలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం వయోవృద్ధ లబ్ధిదారులు శనివారం ఉదయం నుంచి పడిగాపులు కాశారు. పెన్షన్ పంపిణీపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో పలువురు వృద్ధులు సచివాలయం వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయంపై వివరాలు తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు త్రిపురాంతకం ఎంపీడీవోను చరవాణి ద్వారా సంప్రదించగా స్పందన లభించలేదని సమాచారం. దీంతో లబ్ధిదారులు అయోమయంలో ఉన్నట్లు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి పెన్షన్ పంపిణీపై స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.