BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

పెనుగొలను జెడ్పీ హైస్కూల్‌కు నీటి శుద్ధి యంత్రం వితరణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Aug, 2026 - 07:29 PM
92 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు దాత నీటి శుద్ధి యంత్రాన్ని అందజేశారు.

గంపలగూడెం మండలం కొణిజర్ల గ్రామానికి చెందిన కీశే నంబూరి శేషగిరిరావు జ్ఞాపకార్థం ఆయన ధర్మపత్ని పద్మావతి రూ.20 వేల విలువైన నీటి శుద్ధి యంత్రాన్ని గురువారం పాఠశాలకు అందించారు. ఈ యంత్రం ద్వారా విద్యార్థులకు సురక్షితమైన, శుభ్రమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. దుర్గాప్రసాద్ తెలిపారు.

నీటి శుద్ధి యంత్రాన్ని పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు ఆదూరి ఆంజనేయులు లాంఛనంగా ప్రారంభించారు. పాఠశాలకు అవసరమైన యంత్రాన్ని అందించిన దాత పద్మావతిని, అలాగే దాతను ప్రోత్సహించిన ఉపాధ్యాయులు కె.వి. కృష్ణారావును పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల దాత చూపిన శ్రద్ధ అభినందనీయమని పేర్కొన్నారు.