పెనుగొలను జెడ్పీ హైస్కూల్కు నీటి శుద్ధి యంత్రం వితరణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు దాత నీటి శుద్ధి యంత్రాన్ని అందజేశారు.
గంపలగూడెం మండలం కొణిజర్ల గ్రామానికి చెందిన కీశే నంబూరి శేషగిరిరావు జ్ఞాపకార్థం ఆయన ధర్మపత్ని పద్మావతి రూ.20 వేల విలువైన నీటి శుద్ధి యంత్రాన్ని గురువారం పాఠశాలకు అందించారు. ఈ యంత్రం ద్వారా విద్యార్థులకు సురక్షితమైన, శుభ్రమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. దుర్గాప్రసాద్ తెలిపారు.
నీటి శుద్ధి యంత్రాన్ని పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు ఆదూరి ఆంజనేయులు లాంఛనంగా ప్రారంభించారు. పాఠశాలకు అవసరమైన యంత్రాన్ని అందించిన దాత పద్మావతిని, అలాగే దాతను ప్రోత్సహించిన ఉపాధ్యాయులు కె.వి. కృష్ణారావును పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల దాత చూపిన శ్రద్ధ అభినందనీయమని పేర్కొన్నారు.