www.ntodaynews.com
లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 10వ ఘనంగా విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం 10వ విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఉత్సవం భాగంగా స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది.
ఆలయ అర్చకుడు దాములూరి సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో భక్తులు శ్రీ చెంచులక్ష్మి–రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకాలు చేసి, పంచాంగ శ్రవణం చేశారు.
ఆలయ కమిటీ కన్వీనర్ పరుచూరు హరిమాధగుప్త ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉత్సవం సాఫీగా జరిగేలా చూసుకున్నారు. గ్రామ వాసులు ఉత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కీర్తనలను ఆస్వాదించారు.