www.ntodaynews.com
పెనుగొలను మెట్టగుట్ట ఆలయానికి రూ.15 వేల విరాళం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
పెనుగొలను మెట్టగుట్ట ఆలయానికి రూ.15 వేల విరాళం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను)
పెనుగొలను గ్రామ సరిహద్దుల్లోని మెట్టగుట్ట శ్రీ గజలక్ష్మి సమేత శేషాచల శ్రీనివాసస్వామి ఆలయానికి శనివారం దాతలు విరాళం అందజేశారు.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన బుర్రా మాధవరెడ్డి, రాధ దంపతులు ఆలయ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.15 వేల విరాళాన్ని ఆలయ చైర్మన్ పంది వెంకట్రావుకు అందజేశారు.
అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకోగా ఆలయ అర్చకులు యోగానందాచార్యులు వేదమంత్రాలతో ఆశీర్వదించి సత్కరించారు. ఆలయానికి విరాళం అందించిన దాతలకు ఆలయ కమిటీ సభ్యులు ఆర్. వెంకటసుబ్బారావు, వి. కృష్ణారెడ్డి తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.