BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

పెనుగొలనులో ఘనంగా ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 12:27 PM
100 వీక్షణలు

పెనుగొలనులో ఘనంగా ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు

గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని 99వ అంగన్వాడీ కేంద్రంలో శనివారం శిరిడి సాయి బాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ జానపద దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామీణ కళలకు విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ చెక్కభజన, నాటక కళాకారుడు రాళ్లచర్ల జగన్నాథం, కోలాటం కళాకారుడు నాగరాజులను సాయి బాబా సేవా కమిటీ సభ్యులు నూతన వస్త్రాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.

అనంతరం జరిగిన సభలో కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ.. తరతరాలుగా వస్తున్న మన సంస్కృతి, సంప్రదాయాలకు జానపద కళలే జీవనాడిగా నిలిచాయని అన్నారు. ఈ కళారూపాలను కాపాడుకోవడం ద్వారా మన వారసత్వానికి గౌరవం ఇచ్చినట్లవుతుందని తెలిపారు. చెక్కభజన, కోలాటం, వీధి నాటకాలు, తోలుబొమ్మలాట, జానపద నృత్యాలు ప్రాంతీయ సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ కన్వీనర్ రంగు సత్యనారాయణ మాట్లాడుతూ.. కుల, మతాలకు అతీతంగా జానపద కళారూపాలు గ్రామీణ ప్రజలను ఏకం చేసి సామాజిక ఐక్యతను పెంపొందించాయని తెలిపారు. రామాయణం, మహాభారతం వంటి పురాణ గాథలను సైతం చదువు లేని వారికి ఈ కళారూపాల ద్వారా చేరువ చేశాయని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బండారుపల్లి కృష్ణయ్య, ఓరుగంటి సురేష్, మహిళా కమిటీ సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.