BREAKING
Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి
www.ntodaynews.com

Tribute: మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jun, 2026 - 11:34 AM
51 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా | గంపలగూడెం | జూన్ 28 | NTODAY NEWS

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఆదివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు 105వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నరసింహారావు చిత్రపటానికి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.

శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, పి.వి. నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, దేశ ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకుడిగా నిలిచారని అన్నారు. భారత అభివృద్ధిలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన నాయకత్వం నేటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అనంతరం భారత ప్రధానమంత్రిగా పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తూ దేశ అభివృద్ధికి విశేష సేవలు అందించారని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు పాశం వెంకటేశ్వర్లు, వడ్డెరపు నాగేశ్వరరావు, కోరంపల్లి భద్రం, మహిళా సభ్యులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.