Obituary: పెనుగొలను గ్రామంలో విషాదం.. రామలింగేశ్వర స్వామి ఆలయ అర్చకులు దాములూరి రామలింగేశ్వర శర్మ కన్నుమూత
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, పెనుగొలను | NTODAY NEWS
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ అర్చకులు దాములూరి రామలింగేశ్వర శర్మ (65) ఆదివారం ఉదయం కన్నుమూశారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఈ నెల 15వ తేదీన వాహనం నుంచి కిందపడటంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
రామలింగేశ్వర శర్మ భార్య ఏడాది క్రితమే మృతి చెందగా, ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆలయంలో అర్చకుడిగా సేవలందిస్తూ భక్తుల అభిమానాన్ని, గ్రామ ప్రజల గౌరవాన్ని సంపాదించుకున్నారు.
ఆయన మృతి పట్ల ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఆయన మరణంతో పెనుగొలను గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.