BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై CPI-ML లిబరేషన్ ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jun, 2026 - 08:57 PM
126 వీక్షణలు

రమణక్కపేట: CPI-ML లిబరేషన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు ప్రకారం, అఖిల్ భారత ప్రగతీశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య, AICCTU నాయకులు పల్లి పాము భవాని, నంది పాము రాణి, నంది పాము నవ్య, నంది పాము చిట్టెమ్మ, నందిపాము రాహేలు, ఆముదాల రత్నం, ఆముదాల పండు, దా రా బేబీ శాలనీ, విజయలక్ష్మి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

వేముల బక్కయ్య మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది. గత కొన్ని వారాలుగా కృత్రిమ కొరత సృష్టించి ప్రజల్లో ఆందోళన కల్పించడం ద్వారా మైండ్ గేమ్ ఆడి రేట్ల పెంపుకు సిద్ధం చేయడం జరుగుతున్నది అని ఆయన అన్నారు.

అతను ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తూ, వారానికి ఒక రోజు మాత్రమే పెట్రోల్, డీజిల్ రేట్లపై “విశ్రాంతి” ఇవ్వడం, ప్రధాన మంత్రి మరియు ఇతర ప్రముఖుల కాన్వాయ్‌ల ఖర్చులు తగ్గించకపోవడం వంటి చర్యలు ప్రజలను తప్పుదారిలో నెట్టే ప్రయత్నమని పేర్కొన్నారు. VIP జీవన విధానాన్ని సవరించి సామాన్యులపై భారం తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రస్తుత మార్కెట్లో బంగారం ధరలు అత్యధికంగా ఉన్నాయని, పేద మరియు మధ్య తరగతి కుటుంబాలు బంగారం కొనడం కష్టమైపోయారని, పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుతో రవాణా వ్యవస్థపై ప్రభావం పడడంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అందుకే ప్రజలను “నిత్యావసర సరుకులు కొనొద్దు” అంటూ పిలవడం అసమంజసమని అన్నారు.

వేముల బక్కయ్య చివరగా చెప్పారు, పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించకపోతే ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని.