BREAKING
పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చిన్మయ మిషన్ 75 సంవత్సరాల చిన్మయ అమృత మహోత్సవాలు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చిన్మయ మిషన్ 75 సంవత్సరాల చిన్మయ అమృత మహోత్సవాలు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్!
www.ntodaynews.com

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఆందోళన.. చిత్తపూరులో ఆటో లాగి వినూత్న నిరసన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:47 PM
61 వీక్షణలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. పెరిగిపోతున్న ఇంధన ధరలకు నిరసనగా కార్యకర్తలు ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్నంగా ఆందోళన చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, పెట్రోలు, డీజిల్‌పై విధిస్తున్న భారీ పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీజిల్ ధరల పెరుగుదల ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందని జిల్లా కార్యవర్గ సభ్యుడు చాట్ల బాబురావు ఆరోపించారు.

మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఇంధన ధరల పెరుగుదలతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందన్నారు. రైతులు ఎరువులు, యూరియా కొనుగోలు చేయడానికే ఇబ్బందులు పడుతున్నారని, సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని పేర్కొన్నారు.

ఆటో కార్మికులు మాట్లాడుతూ, పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలతో ఆదాయం తగ్గిపోగా ఖర్చులు పెరిగి ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వంటగ్యాస్ ధరల పెరుగుదలతో చిన్న హోటళ్ల నిర్వహణ భారంగా మారి అనేక హోటళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడిందని హోటల్ నిర్వాహకులు తెలిపారు.

ఇంధన ధరలను వెంటనే తగ్గించి ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలని నిరసనకారులు ప్రభుత్వాలను కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆటో కార్మికులు, హోటల్ నిర్వాహకులు పాల్గొన్నారు.