BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 02 June 2026, 07:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 07:59 PM
178 వీక్షణలు

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం

ఏలూరు జిల్లా, ముసునూరు మండలం: ముసునూరు మండలం చింతలవల్లి శివారు కొత్తూరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్న గంగుల ఏలి బాబు పిడుగుపాటుకు గురై దుర్మరణం చెందాడు.

సమాచారం మేరకు, ఏలి బాబు గొర్రెలను మేపేందుకు పొలాలకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించాయి. ఈ క్రమంలో పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఏలి బాబు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అకాలంగా కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. స్థానికులు మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.