BREAKING
తెలంగాణలో అమల్లోకి వచ్చిన న్యాయవాదుల రక్షణ చట్టం ​మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడంపై స్పందన పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ తెలంగాణలో అమల్లోకి వచ్చిన న్యాయవాదుల రక్షణ చట్టం ​మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడంపై స్పందన పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ
www.ntodaynews.com

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 07:59 PM
14 వీక్షణలు

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం

ఏలూరు జిల్లా, ముసునూరు మండలం: ముసునూరు మండలం చింతలవల్లి శివారు కొత్తూరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్న గంగుల ఏలి బాబు పిడుగుపాటుకు గురై దుర్మరణం చెందాడు.

సమాచారం మేరకు, ఏలి బాబు గొర్రెలను మేపేందుకు పొలాలకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించాయి. ఈ క్రమంలో పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఏలి బాబు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అకాలంగా కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. స్థానికులు మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.