BREAKING
భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ దుర్గాదేవి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ దుర్గాదేవి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం
www.ntodaynews.com

పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో భారీ జాతీయ పతాక ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 03:14 PM
6 వీక్షణలు

పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో భారీ జాతీయ పతాక ప్రదర్శన

జంగారెడ్డిగూడెం: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆదివారం ఘనంగా జాతీయ పతాక ప్రదర్శన నిర్వహించారు. రెండు కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాతో బస్టాండ్ సెంటర్ నుంచి ప్రభుత్వ బాలుర పాఠశాల వరకు భారీ ర్యాలీ చేపట్టారు. దేశభక్తి నినాదాల మధ్య సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు, యువత, కూటమి పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొని జాతీయ పతాకంతో నిర్వహించిన 2కే వాక్‌లో నడిచారు. పింగళి వెంకయ్య దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం దేశ ఐక్యత, సమగ్రతకు జాతీయ పతాకం ప్రతీక అని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను గౌరవించాలని పిలుపునిచ్చారు.

జాతీయ పతాక ప్రదర్శనలో జంగారెడ్డిగూడెం కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు