పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో భారీ జాతీయ పతాక ప్రదర్శన
పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో భారీ జాతీయ పతాక ప్రదర్శన
జంగారెడ్డిగూడెం: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆదివారం ఘనంగా జాతీయ పతాక ప్రదర్శన నిర్వహించారు. రెండు కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాతో బస్టాండ్ సెంటర్ నుంచి ప్రభుత్వ బాలుర పాఠశాల వరకు భారీ ర్యాలీ చేపట్టారు. దేశభక్తి నినాదాల మధ్య సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు, యువత, కూటమి పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొని జాతీయ పతాకంతో నిర్వహించిన 2కే వాక్లో నడిచారు. పింగళి వెంకయ్య దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం దేశ ఐక్యత, సమగ్రతకు జాతీయ పతాకం ప్రతీక అని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను గౌరవించాలని పిలుపునిచ్చారు.
జాతీయ పతాక ప్రదర్శనలో జంగారెడ్డిగూడెం కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు