BREAKING
thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి
Date of Publish : 16 September 2026, 05:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మిషన్ మార్చి కార్యక్రమం పరిశీలించిన ఎంఈఓ1 మాసగిరి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Sep, 2026 - 05:31 PM
0 వీక్షణలు

చిత్తపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మిషన్ మార్చి కార్యక్రమం పరిశీలించిన ఎంఈఓ1 మాసగిరి

ఏలూరు జిల్లా / నూజివీడు నియోజకవర్గం / చాట్రాయి మండలం: చిత్తపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ప్రవేశపెట్టిన మిషన్ మార్చి కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ప్రధానోపాధ్యాయురాలు సౌభాగ్యం ను అడిగి తెలుసుకున్నారు.

మిషన్ మార్చిలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు గణితంలో నిర్వహిస్తున్న స్లిప్ పరీక్షను ఎంఈఓ1 శ్రీనివాస్ పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న పరీక్ష విధానాన్ని పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు క్రమం తప్పకుండా సాధన చేయాలని, సందేహాలను ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని విద్యార్థులకు తగిన సలహాలు, సూచనలు చేశారు.

అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.

పదో తరగతి విద్యార్థుల హాజరు శాతం మెరుగుపడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎంఈఓ1 సూచించారు. మిషన్ మార్చి కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేసి విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని పేర్కొన్నారు. మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు.

అలాగే పాఠశాలల్లో నిర్వహించనున్న ఎస్‌ఎంసీ ఎన్నికలను నిబంధనల ప్రకారం జాగ్రత్తగా నిర్వహించడం ప్రధానోపాధ్యాయుల బాధ్యత అని ఎంఈఓ1 మాసగిరి శ్రీనివాస్ స్పష్టం చేశారు.