పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ..
పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ..
పల్నాడు జిల్లా పోలీస్ శాఖ స్పెషల్ బ్రాంచ్ (ఎస్బి) సీఐ-1గా సామినేని ఆంథోనీ రాజు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
గతంలో ఆయన ప్రకాశం జిల్లాలోని ఒంగోలు తాలూకాతో పాటు పలు పోలీస్ స్టేషన్లలో సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై)గా సుదీర్ఘ కాలం సేవలందించారు.ఆ తర్వాత పదోన్నతి పొంది, అత్యంత కీలకమైన ప్రత్యేక అమలు విభాగం (SEB), నేర పరిశోధన శాఖ (CID) వంటి విభాగాలలో సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా విధులు నిర్వహించి విశేష అనుభవాన్ని గడించారు.విధి నిర్వహణలో అత్యంత నిబద్ధత, సమర్థవంతమైన నాయకత్వ పటిమ కలిగిన అధికారిగా ఆంథోనీ రాజుకు మంచి గుర్తింపు ఉంది. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే, శాంతిభద్రతల పరిరక్షణలోనూ, క్లిష్టమైన పరిస్థితులను చాకచక్యంగా ఎదుర్కోవడంలోనూ ఆయన సిద్ధహస్తులని పేరు తెచ్చుకున్నారు. తన సుదీర్ఘ సేవా అనుభవంతో పల్నాడు జిల్లా పోలీస్ శాఖకు ఆయన మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తారని ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలోని పలువురు పోలీస్ అధికారులు, సిబ్బం