www.ntodaynews.com
శ్రీశైలంలో పల్లకీ ఉత్సవం నిర్వహణ
తెలంగాణ
శ్రీశైలంలో పల్లకీ ఉత్సవం నిర్వహణ
లోకకల్యాణార్థం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున
లోకకల్యాణం కోసం ఆదివారం (22.02.2026) రాత్రి శ్రీ స్వామి–అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించబడుతుంది.
పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలా నక్షత్రం రోజుల్లో దేవస్థానం సేవగా నిర్వహించబడుతోంది. కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మవారి ఆలయంలోని ఆశీర్వచన మండపంలో అర్చకులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సేవా సంకల్పాన్ని పఠిస్తారు. అనంతరం మహాగణపతి పూజ నిర్వహిస్తారు.
తదుపరి శ్రీ స్వామి–అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేపు చేసి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహించబడతాయి.
(కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)
శ్రీశైల దేవస్థానం ద్వారా జారీ
#Srisailam #PallakiUtsavam #TempleRituals #DevotionalNews #TelanganaNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube