పంచాయతీ రోడ్డు ఆక్రమణపై గ్రామస్తుల ఆందోళన
పంచాయతీ రోడ్డు ఆక్రమణపై నక్కా రాము ఆధ్వర్యంలో గ్రామస్తుల ఆందోళన
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలో పంచాయతీ రోడ్డు స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపడుతున్న అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సుమారు 500 కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామంలో ఎంపీపీ పాఠశాల, కమ్యూనిటీ హాల్, గౌడ బజార్కు వెళ్లే ప్రధాన మార్గం ఇదే కావడంతో ప్రజలు రోజూ ఈ రహదారిని ఉపయోగిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు అయిన వరిగడ్డి, ధాన్యం తరలింపులు కూడా ఈ దారిగానే జరుగుతున్నాయి.
ఇలాంటి రద్దీగా ఉండే మార్గాన్ని ఆక్రమించడం వల్ల రహదారి ఇరుకుగా మారి రాకపోకలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిశీలన చేపట్టి అక్రమ నిర్మాణాన్ని తొలగించి రహదారిని పరిరక్షించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.