పంటల బీమాతో రైతు భవిష్యత్తుకు రక్షణ: నక్కా రాము పిలుపు
ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం: పంటల బీమా–రైతు భవిష్యత్తుకు రక్షణ కార్యక్రమంలో భాగంగా చాట్రాయి మండలం చనుబండ పంచాయతీ పరిధిలో రైతులకు పంటల బీమాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము మాట్లాడుతూ, ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతులు పంట నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ప్రతి రైతు తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని సూచించారు.
రైతులు నష్టపోకుండా రక్షించడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని, అందుకే అధికారులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవడానికి పంటల బీమా ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విహెచ్ఏ నాగమణి, గ్రామ రైతులు పాల్గొన్నారు.