BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

పొగాకు రైతుల తరఫున ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గళం.. బ్యారెన్ కోటా 40 క్వింటాళ్లకు పెంచాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 07:17 PM
70 వీక్షణలు

ఏలూరు, జూన్ 25: పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పొగాకు బోర్డును కోరారు. గుంటూరులో గురువారం జరిగిన పొగాకు బోర్డు సమావేశంలో ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్న ఆయన, రైతుల సమస్యలను బోర్డు సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు.

ఇటీవల ఏలూరులో తనను కలిసిన పొగాకు రైతులు యార్డుల్లో కొనుగోలు ధరలు పడిపోవడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని ఎంపీ సమావేశంలో ప్రస్తావించారు. కనీసం క్వింటాల్‌కు రూ.300 ధర లభించకపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని వివరించారు.

ముఖ్యంగా పొగాకు బ్యారెన్‌కు ఉత్పత్తి పరిమితిని 35 క్వింటాళ్లుగా నిర్ణయించడం రైతులకు గిట్టుబాటు కాదని పేర్కొన్నారు. దిగుబడులు తగ్గడం, పెట్టుబడి వ్యయాలు పెరగడం వంటి పరిస్థితుల్లో గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా బ్యారెన్‌కు ఉత్పత్తి పరిమితిని 40 క్వింటాళ్లకు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలోని NLS పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బ్యారెన్ కోటాను 40 క్వింటాళ్లకు పెంచాలని బోర్డును ఎంపీ విజ్ఞప్తి చేశారు.

ఎంపీ విజ్ఞప్తిపై స్పందించిన యశ్వంత్ కుమార్, రైతుల డిమాండ్లను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, కొనుగోలుదారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.