పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీఎంహెచ్ఓ డాక్టర్ అనిత
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో కరపత్రాల విడుదల
బస్టాండ్, రైల్వే స్టేషన్లలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
మంచిర్యాల:ఆరోగ్యవంతమైన, పొగాకు రహిత భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కార్యాలయంలో ఆమె ప్రత్యేక అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పొగాకు మహమ్మారి వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు జిల్లా వ్యాప్తంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. "పొగాకును విడిచిపెట్టండి - ఆరోగ్యకరమైన జీవితం గడపండి" అనే ముఖ్య నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ప్రజలందరూ భాగస్వాములై పొగాకు రహిత సమాజ స్థాపనకు సహకరించాలని ఆమె కోరారు