పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించిన నవతేజ్ హాస్పిటల్ వైద్యులు
పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించిన నవతేజ్ హాస్పిటల్ వైద్యులు
ఏలూరు జిల్లా చింతలపూడి
చింతలపూడి పోలీస్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ సిబ్బంది పరేడ్ కార్యక్రమం శుక్రవారం స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగింది. ఈ పరేడ్లో సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నవతేజ్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నరేష్ బాబు (మాజీ ఇండో టిబెటన్ కమాండెంట్) పోలీస్ సిబ్బందికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. సిబ్బంది ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి అవసరమైన సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎస్సై సతీష్ కుమార్, ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్నతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి వైద్య పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.