BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

పోలవరం గ్రామాభివృద్ధికి పానుగంటి కుటుంబం చేయూత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Aug, 2026 - 10:23 PM
245 వీక్షణలు

పోలవరం గ్రామాభివృద్ధికి పానుగంటి కుటుంబం చేయూత

  • ఆర్‌సీఎం చర్చి ప్రహరీ గోడ నిర్మాణానికి మెటీరియల్‌ అందిస్తామని హామీ

చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో సేవా కార్యక్రమాలకు పానుగంటి కుటుంబం మరోసారి ముందుకు వచ్చింది. పోలవరం గ్రామానికి చెందిన కీర్తిశేషులు పానుగంటి సత్యం జ్ఞాపకార్థం ఆయన కుమారులు పానుగంటి మహేష్ గౌడ్, పానుగంటి సూరిబాబు మంగళవారం పోలవరం పడమటి హరిజనవాడలో ఆర్‌సీఎం సంఘ సభ్యులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆర్‌సీఎం సంఘ పెద్దలు డోలా సుబ్బారావు, చాట్ల రామస్వామి, తనగల హుజూర్ కోట రవి, ఆమేర్ల ధర్మారావు, పర్స వెంకటేశ్వరరావు, దుబ్బాక నాగేష్ తదితరుల సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఆర్‌సీఎం చర్చి ప్రాంగణం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ను తన వంతు సహాయంగా అందించేందుకు పానుగంటి మహేష్ గౌడ్, పానుగంటి సూరిబాబు ముందుకు వచ్చారు. చర్చి మూడు వైపులా ప్రహరీ గోడ నిర్మాణానికి అయ్యే ఖర్చుకు అవసరమైన నిర్మాణ సామగ్రిని సమకూర్చుతామని సంఘ సభ్యులకు హామీ ఇచ్చారు.

పదేళ్లుగా సేవా కార్యక్రమాలు

పానుగంటి కుటుంబం గత కొంతకాలంగా పోలవరం గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కీర్తిశేషులు పానుగంటి సత్యం జ్ఞాపకార్థం ఆయన కుమారులు గత పదేళ్లుగా గ్రామంలో వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. గ్రామంలోని హిందూ దేవాలయాలకు అవసరమైన వసతులు, నిర్మాణ సామగ్రిని కూడా అందిస్తూ ఆలయాల అభివృద్ధికి సహకరిస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకుండా విద్యార్థులకు కూడా తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు పానుగంటి కుటుంబ సభ్యులు తెలిపారు. మతాలు, వర్గాలకు అతీతంగా గ్రామ అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు కొనసాగించడం తమ కుటుంబం బాధ్యతగా భావిస్తోందని పేర్కొన్నారు.

సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం

కీర్తిశేషులు పానుగంటి సత్యం జ్ఞాపకార్థం గ్రామంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు తమ కుటుంబం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పానుగంటి మహేష్ గౌడ్, పానుగంటి సూరిబాబు తెలిపారు. గ్రామ ప్రజలకు అవసరమైన సందర్భాల్లో తమ వంతు సహకారం అందించడం కొనసాగిస్తామని ‘ఎన్‌టుడే న్యూస్’కు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్‌సీఎం సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు పానుగంటి కుటుంబాన్ని అభినందించారు.