BREAKING
గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు
www.ntodaynews.com

పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 05:43 PM
93 వీక్షణలు

ఏలూరు:

సమాజ సేవలో ముందుండే సాయి హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో మరో సేవా కార్యక్రమం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి రూ.10,000 నగదు సహాయం అందించారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి బాణావతు తులసి నాయక్ కుటుంబానికి ఈ సాయం అందజేశారు.

పదవ తరగతి పరీక్షల్లో 480 మార్కులు సాధించిన తులసి నాయక్ తండ్రి రాజుకు సభ్యులు ఈ సహాయం ఇచ్చారు. కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని కొంతైనా ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ముందుకొచ్చినట్లు తెలిపారు.

పరీక్షల సమయంలో తల్లి పాముకాటు కారణంగా మృతి చెందడం తులసి నాయక్ జీవితంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయినప్పటికీ ఆ బాధను జయించి ధైర్యంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించడం అతని పట్టుదల, లక్ష్యసాధనకు నిదర్శనంగా నిలిచింది. ఈ ఘటన అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది.

కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు.