BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 05:43 PM
136 వీక్షణలు

ఏలూరు:

సమాజ సేవలో ముందుండే సాయి హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో మరో సేవా కార్యక్రమం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి రూ.10,000 నగదు సహాయం అందించారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి బాణావతు తులసి నాయక్ కుటుంబానికి ఈ సాయం అందజేశారు.

పదవ తరగతి పరీక్షల్లో 480 మార్కులు సాధించిన తులసి నాయక్ తండ్రి రాజుకు సభ్యులు ఈ సహాయం ఇచ్చారు. కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని కొంతైనా ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ముందుకొచ్చినట్లు తెలిపారు.

పరీక్షల సమయంలో తల్లి పాముకాటు కారణంగా మృతి చెందడం తులసి నాయక్ జీవితంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయినప్పటికీ ఆ బాధను జయించి ధైర్యంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించడం అతని పట్టుదల, లక్ష్యసాధనకు నిదర్శనంగా నిలిచింది. ఈ ఘటన అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది.

కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు.