BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 05:43 PM
54 వీక్షణలు

ఏలూరు:

సమాజ సేవలో ముందుండే సాయి హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో మరో సేవా కార్యక్రమం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి రూ.10,000 నగదు సహాయం అందించారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి బాణావతు తులసి నాయక్ కుటుంబానికి ఈ సాయం అందజేశారు.

పదవ తరగతి పరీక్షల్లో 480 మార్కులు సాధించిన తులసి నాయక్ తండ్రి రాజుకు సభ్యులు ఈ సహాయం ఇచ్చారు. కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని కొంతైనా ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ముందుకొచ్చినట్లు తెలిపారు.

పరీక్షల సమయంలో తల్లి పాముకాటు కారణంగా మృతి చెందడం తులసి నాయక్ జీవితంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయినప్పటికీ ఆ బాధను జయించి ధైర్యంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించడం అతని పట్టుదల, లక్ష్యసాధనకు నిదర్శనంగా నిలిచింది. ఈ ఘటన అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది.

కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు.