www.ntodaynews.com
పోతనపల్లి గ్రామంలో మంగయ్య ఆధ్వర్యంలో మంత్రి కొలుసు.పార్థసారధి గారి జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
పోతనపల్లి గ్రామంలో మంగయ్య ఆధ్వర్యంలో మంత్రి కొలుసు పార్థసారధి జన్మదిన వేడుకలు
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో గ్రామ నాయకులు మంగయ్య ఆధ్వర్యంలో నూజివీడు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార ప్రసార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు భాస్కరరావు, ఉపాధ్యక్షుడు కృష్ణ ప్రసాద్, బూత్ కన్వీనర్ ఏసుబాబు, గ్రామ కార్యదర్శి పెద్ద వెంకటేశ్వరరావు, రాములు, నాగేశ్వరావు, చాట్రాయి మండల వాణిజ్య విభాగం కార్యదర్శి వెంకటసీతారామయ్య, రాజీవ్ నాయక్ మరియు ఇతర టీడీపీ కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
ప్రభుత్వ అభివృద్ధి పథకాలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై విశేషమైన చర్చలు జరిపారు.