www.ntodaynews.com
పోతనపల్లి పెద్ద తండాలో రోడ్డు క్లీన్ చేస్తూ బూత్ కన్వీనర్ ఏసుబాబు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
పోతనపల్లి పెద్ద తండాలో రోడ్డు క్లీన్ చేస్తూ బూత్ కన్వీనర్ ఏసుబాబు
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లి పెద్ద తండాలో డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం అనంతరం రోడ్డు మీద పోసిన మట్టిని చదును చేయకుండ అనుమతించిన కాంట్రాక్టర్ బత్తుల మాధవరావు కారణంగా గ్రామంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. ముఖ్యంగా స్కూలు పిల్లల వ్యాన్ తిరగడానికి అవకాశం లేకపోవడంతో వారు ఎండల్లో నడవాల్సి వచ్చారు.
ఈ సమస్య గురించి గ్రామ నాయకులకు తెలియపరిచిన తరువాత, తెలుగుదేశం పార్టీ 21వ బూత్ కన్వీనర్ బాణవతు ఏసుబాబు ముందుకు వచ్చి, సిమెంట్ రోడ్డు మీద ఉన్న మట్టిని క్లీన్ చేయించడమే కాకుండా, రాకపోకలకు అనుకూల మార్గాన్ని అందించారు.
ఈ చర్య తరువాత, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు ఏసుబాబు మరియు వినోద్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.