ప్రాణదాతలుగా నిలవండి.. రక్తదానం అందరి బాధ్యత: మేయర్ పిలుపు
తలసేమియా, సికిల్ సెల్ బాధితుల కోసం మేయర్ ధరణి మధుకర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
మంచిర్యాల: రక్తదానం అనేది ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ పిలుపునిచ్చారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ప్రత్యేక చొరవతో.. ప్రధానంగా తలాసేమియా, సికిల్ సెల్ వ్యాధులతో బాధపడుతున్న బాధితులను ఆదుకునేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది అత్యంత ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేయగా, మొత్తం 100 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడటానికి ముందుకు వచ్చిన రక్తదాతలను ఈ సందర్భంగా మేయర్ ప్రత్యేకంగా అభినందించారు