ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు భర్తీ చేయాలి
ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు భర్తీ చేయాలి
నల్గొండ జిల్లా చిట్యాల విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లను భర్తీ చేయాలని కోరుతూ విద్యా నిర్వీజ్ఞ ఫౌండేషన్ అధ్యక్షులు బోల్గురి ముకేష్ బుధవారం చిట్యాల మండల విద్యాధికారి సైదా నాయక్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ఉచిత సీట్ల కేటాయింపును ఒక జాతీయ మిషన్గా భావించి అమలు చేయాలి. ప్రతి స్కూల్ తమ నోటీసు బోర్డులపై అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను ప్రదర్శించాలి తెలిపారు ఎంపికైన విద్యార్థుల నుండి పుస్తకాలు, యూనిఫాం లేదా ఇతర ఫీజుల పేరిట ఎలాంటి నగదు వసూలు చేయకూడదు కేవలం ఒకటో తరగతికే కాకుండా, 2 నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఖాళీల్లో కూడా పేద విద్యార్థులకు ప్రవేశం కల్పించాలి అన్నారు. ఏప్రిల్ 30 లోపు దీనిపై కార్యాచరణ నివేదిక విడుదల చేయాలని ఫౌండేషన్ ద్వారా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చరణ్య శ్రీ ఫౌండేషన్ చైర్మన్ దోమలపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.