BREAKING
అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు
www.ntodaynews.com

కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన కలెక్టర్.. ఆదర్శంగా నిలిచిన ప్రభాకరరెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ పార్వతీపురం మన్యం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 12:31 PM
65 వీక్షణలు

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ N. Prabhakar Reddy తన కుమారుడు ఎన్. క్రిష్ ధరణ్ రెడ్డిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై విశ్వాసాన్ని చాటేలా తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసలు అందుకుంటోంది.

క్రిష్ ధరణ్ రెడ్డి విజయవాడలోని పడమట జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి పూర్తిచేయగా, ప్రస్తుతం పార్వతీపురంలోని Dr. Dindigal Venkat Rao Memorial Municipal Schoolలో పదో తరగతిలో చేరాడు.

జిల్లా కలెక్టర్ కుమారుడు తమ పాఠశాలలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రధానోపాధ్యాయుడు, దీనివల్ల తమపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు.

గతంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి (పీవో)గా పనిచేసిన Kurmanath కూడా తన కుమారుడిని ఇదే పాఠశాలలో చదివించిన విషయం గుర్తు చేస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం పలువురికి స్ఫూర్తిదాయకంగా మారింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనూ నాణ్యమైన విద్య అందుబాటులో ఉందనే సందేశాన్ని ఈ చర్య బలంగా చాటుతోంది.