ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణీ
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణీ
రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు అందజేత
(మంచిర్యాల/హాజీపూర్):గ్రామీణ ప్రాంత విద్యార్థుల విద్యాభివృద్ధికి 'రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్' విశేష కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్కూల్ కిట్లను పంపిణీ చేశారు.
హాజీపూర్ మండలంలోని రాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అలాగే లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావు పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు రఘునాథ్ వెరబెల్లి గారు స్వయంగా విచ్చేసి ఈ కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ... విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, రాబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, వారి విద్యావసరాలకు తమ ఫౌండేషన్ ద్వారా ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, స్థానిక ప్రజాప్రతినిధులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఫౌండేషన్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు