www.ntodaynews.com
ప్రభుత్వ పాఠశాలల్లో మెరిసిన ప్రతిభ
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ పాఠశాలల్లో మెరిసిన ప్రతిభ – విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే అభినందనలు
చింతలపూడి: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చింతలపూడి శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ క్యాంపు కార్యాలయంలో అభినందించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను కొనియాడుతూ, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సాహం ఇచ్చారు. కష్టపడి చదివితే విజయాన్ని తప్పకుండా సాధించవచ్చని, లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలని సూచించారు.
మండలంలో మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను కూడా అభినందించారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.