BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి : కక్కిరేణి సర్పంచ్ మధుర వేణి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
15 Jun, 2026 - 05:30 PM
59 వీక్షణలు

బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కక్కిరేణి గ్రామ సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్ పిలుపునిచ్చారు. పాఠశాలల పునః ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం గ్రామంలో 'బడిబాట' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల తల్లిదండ్రులకే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అధిక ప్రాధాన్యత ఉంటుందన్న పైఅధికారుల సూచనలను సర్పంచ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాఠశాలల వసతుల కల్పనకు దాతలు ముందుకు రావాలని కోరారు. కక్కిరేణి ,గ్రామపంచాయతీలో భాగంగా ఉన్న గ్రామమైన రంగమ్మగూడెంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. రవాణా సౌకర్యం కల్పిస్తే తమ పిల్లలను కక్కిరేణి పాఠశాలలో చేర్పిస్తామని స్థానిక తల్లిదండ్రులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నడిగోటి పాండు, ప్రధానోపాధ్యాయులు బి. ఉపేందర్, ఉపాధ్యాయులు రాజన్ బాబు, భద్రయ్య, గణేష్ గోపాల్ రెడ్డి, వార్డు సభ్యులు చిల్ల చంద్రశేఖర్, కోళ్ల సుమలత, బోడ మనీషా, పిండి సైదులు తదితరులు పాల్గొన్నారు.