ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి : కక్కిరేణి సర్పంచ్ మధుర వేణి
బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కక్కిరేణి గ్రామ సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్ పిలుపునిచ్చారు. పాఠశాలల పునః ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం గ్రామంలో 'బడిబాట' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల తల్లిదండ్రులకే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అధిక ప్రాధాన్యత ఉంటుందన్న పైఅధికారుల సూచనలను సర్పంచ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాఠశాలల వసతుల కల్పనకు దాతలు ముందుకు రావాలని కోరారు. కక్కిరేణి ,గ్రామపంచాయతీలో భాగంగా ఉన్న గ్రామమైన రంగమ్మగూడెంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. రవాణా సౌకర్యం కల్పిస్తే తమ పిల్లలను కక్కిరేణి పాఠశాలలో చేర్పిస్తామని స్థానిక తల్లిదండ్రులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నడిగోటి పాండు, ప్రధానోపాధ్యాయులు బి. ఉపేందర్, ఉపాధ్యాయులు రాజన్ బాబు, భద్రయ్య, గణేష్ గోపాల్ రెడ్డి, వార్డు సభ్యులు చిల్ల చంద్రశేఖర్, కోళ్ల సుమలత, బోడ మనీషా, పిండి సైదులు తదితరులు పాల్గొన్నారు.