BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి : కక్కిరేణి సర్పంచ్ మధుర వేణి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
15 Jun, 2026 - 05:30 PM
256 వీక్షణలు

బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కక్కిరేణి గ్రామ సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్ పిలుపునిచ్చారు. పాఠశాలల పునః ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం గ్రామంలో 'బడిబాట' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల తల్లిదండ్రులకే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అధిక ప్రాధాన్యత ఉంటుందన్న పైఅధికారుల సూచనలను సర్పంచ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాఠశాలల వసతుల కల్పనకు దాతలు ముందుకు రావాలని కోరారు. కక్కిరేణి ,గ్రామపంచాయతీలో భాగంగా ఉన్న గ్రామమైన రంగమ్మగూడెంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. రవాణా సౌకర్యం కల్పిస్తే తమ పిల్లలను కక్కిరేణి పాఠశాలలో చేర్పిస్తామని స్థానిక తల్లిదండ్రులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నడిగోటి పాండు, ప్రధానోపాధ్యాయులు బి. ఉపేందర్, ఉపాధ్యాయులు రాజన్ బాబు, భద్రయ్య, గణేష్ గోపాల్ రెడ్డి, వార్డు సభ్యులు చిల్ల చంద్రశేఖర్, కోళ్ల సుమలత, బోడ మనీషా, పిండి సైదులు తదితరులు పాల్గొన్నారు.