ప్రభుత్వ పాఠశాలలో 587 మార్కులు సాధించిన అడపా అపర్ణ దేవి కి అభినందనలు.
ప్రభుత్వ పాఠశాలలో 587 మార్కులు సాధించిన అడపా అపర్ణ దేవికి అభినందనలు.
గొల్లప్రోలు టిడిపి పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు.
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పదో తరగతి పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు అభినందనలు తెలియజేశారు .అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో అమలు చేసిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ఫలితంగా విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారని పేర్కొన్నారు. గురువారం విడుదలైన ఫలితాల్లో 600 మార్కులకు 587 మార్కులు ప్రభుత్వ పాఠశాల విభాగంలో మొదటి స్థానం సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించడం గర్వకారణమని తెలిపారు.
587. మార్కులు సాధించిన అడపా అపర్ణ దేవి కు శుభాకాంక్షలు తెలియజేస్తూ. భవిష్యత్తులోనూ ఇదే పట్టుదలతో ఉన్నత చదువుల్లో రాణించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని అపర్ణ దేవి కు ఆకాంక్షలు వ్యక్తం చేశారు. ఈ విజయాల వెనక కృషిచేసిన ఉపాధ్యాయులకు, తల్లితండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు, "మాతృ దేవోభవ, ఆచార్య దేవోభవ ," మరోసారి సాధకమైంది . ప్రతి విజయం వంతమైన వ్యక్తి వెనుక ఒక గురువు ప్రేరణంగా అలాంటి గురువులను గౌరవించడం నేర్చుకోవాలని అది మనందరి బాధ్యతని తెలియజేశారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు సుబ్బారావు, వారికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, పాల్గొన్నారు.