ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు గౌడ సంక్షేమ సంఘం ఘన సన్మానం
ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు గౌడ సంక్షేమ సంఘం ఘన సన్మానం
తెలంగాణ రాష్ట్ర శాసనసభ విప్గా నూతనంగా నియమించబడిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చిట్యాల గౌడ సంక్షేమ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మాట్లాడుతూ వేముల వీరేశం విప్ పదవి దక్కడం నకిరేకల్ నియోజకవర్గానికి గర్వకారణమని కొనియాడారు. ఆయన నాయకత్వంలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన ఎల్లప్పుడూ ముందుంటారని, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరేలా కృషి చేయాలని కోరారు.
* సన్మానం అనంతరం వేముల వీరేశం మాట్లాడుతూ..
తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసం, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు. తనను అభినందించిన గౌడ సంక్షేమ సంఘం నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కనకదుర్గ గుడి చైర్మన్ ఆంజనేయులు గౌడ్, ఆరో వార్డు కౌన్సిలర్ జెర్రిపోతుల సత్యనారాయణ గౌడ్, కోశాధికారి రేకుల గడ్డ నరసింహ గౌడ్, ఉపాధ్యక్షులు పంతంగి వెంకన్న గౌడ్, పుల్లంల కోటయ్య గౌడ్, పంతంగి కరుణాకర్ గౌడ్, బొడ్డు శంకర్ గౌడ్, కాసుల రాములు గౌడ్, కాసుల బాలరాజు, గుండాల సతయ్య, కొంపల్లి శ్రీను, గురిజ అశోక్, రేగులగడ్డ జగన్, బత్తుల స్వామి, ఉయ్యాల శ్రీను, పొలగోని వెంకన్న, ఉయ్యాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.