www.ntodaynews.com
ప్రధానమంత్రి మోదీకి సీఎం చంద్రబాబు ఆహ్వానం
జాతీయం
ప్రధానమంత్రి మోదీకి సీఎం చంద్రబాబు ఆహ్వానం
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్లమెంట్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, ఆగస్టు 1న జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అధికారికంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధానమంత్రిని చంద్రబాబు కోరారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కూడా ఇద్దరు నేతలు స్వల్పంగా చర్చించినట్లు సమాచారం.