BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
04 Jun, 2026 - 07:50 PM
146 వీక్షణలు

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక: చిట్యాలలో ముమ్మరంగా వార్డు సభలు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ముగింపు వారోత్సవాలలో భాగంగా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4వ మరియు 6వ వార్డులలో గురువారం వార్డు సభలు నిర్వహించారు. ​ఈ సభల్లో చిట్యాల పట్టణ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పందిరి గీతా రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వార్డులలో పారిశుద్ధ్యం, డ్రైనేజీల పూడికతీత, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు మరియు మొక్కల పెంపకం వంటి పలు అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం పట్టణ ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, భవిష్యత్తు తరాలకు నీటి వనరులను అందించేందుకు 'జలసంచయ్', 'జలభాగీరథి' కింద ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఇంకుడు గుంతలు (రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్) ఏర్పాటు చేసుకోవాలని చైర్‌పర్సన్ కోరారు. ​ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ జేరిపోతుల సత్యనారాయణ, 4వ వార్డు కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య, కో-ఆప్షన్ సభ్యురాలు సహజాది ఇబ్రహీం, సూపర్వైజర్ ధనలక్ష్మి, బిల్ కలెక్టర్లు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.