BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
04 Jun, 2026 - 07:50 PM
66 వీక్షణలు

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక: చిట్యాలలో ముమ్మరంగా వార్డు సభలు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ముగింపు వారోత్సవాలలో భాగంగా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4వ మరియు 6వ వార్డులలో గురువారం వార్డు సభలు నిర్వహించారు. ​ఈ సభల్లో చిట్యాల పట్టణ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పందిరి గీతా రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వార్డులలో పారిశుద్ధ్యం, డ్రైనేజీల పూడికతీత, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు మరియు మొక్కల పెంపకం వంటి పలు అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం పట్టణ ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, భవిష్యత్తు తరాలకు నీటి వనరులను అందించేందుకు 'జలసంచయ్', 'జలభాగీరథి' కింద ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఇంకుడు గుంతలు (రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్) ఏర్పాటు చేసుకోవాలని చైర్‌పర్సన్ కోరారు. ​ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ జేరిపోతుల సత్యనారాయణ, 4వ వార్డు కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య, కో-ఆప్షన్ సభ్యురాలు సహజాది ఇబ్రహీం, సూపర్వైజర్ ధనలక్ష్మి, బిల్ కలెక్టర్లు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.