BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
04 Jun, 2026 - 07:50 PM
76 వీక్షణలు

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక: చిట్యాలలో ముమ్మరంగా వార్డు సభలు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ముగింపు వారోత్సవాలలో భాగంగా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4వ మరియు 6వ వార్డులలో గురువారం వార్డు సభలు నిర్వహించారు. ​ఈ సభల్లో చిట్యాల పట్టణ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పందిరి గీతా రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వార్డులలో పారిశుద్ధ్యం, డ్రైనేజీల పూడికతీత, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు మరియు మొక్కల పెంపకం వంటి పలు అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం పట్టణ ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, భవిష్యత్తు తరాలకు నీటి వనరులను అందించేందుకు 'జలసంచయ్', 'జలభాగీరథి' కింద ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఇంకుడు గుంతలు (రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్) ఏర్పాటు చేసుకోవాలని చైర్‌పర్సన్ కోరారు. ​ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ జేరిపోతుల సత్యనారాయణ, 4వ వార్డు కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య, కో-ఆప్షన్ సభ్యురాలు సహజాది ఇబ్రహీం, సూపర్వైజర్ ధనలక్ష్మి, బిల్ కలెక్టర్లు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.