BREAKING
పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చిన్మయ మిషన్ 75 సంవత్సరాల చిన్మయ అమృత మహోత్సవాలు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చిన్మయ మిషన్ 75 సంవత్సరాల చిన్మయ అమృత మహోత్సవాలు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్!
www.ntodaynews.com

ప్రజానేత గొర్రె లాజర్ మృతి పట్ల సర్వత్రా సంతాపం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:37 PM
20 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన ప్రముఖ ప్రజానేత, ప్రస్తుత వైఎస్ఆర్‌సీపీ నేత, ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం నుంచి దళితులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొర్రె లాజర్ (71) గుండెపోటుతో జూన్ 2 రాత్రి కన్నుమూశారు. ఆయన మృతితో విస్సన్నపేట ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

గొర్రె లాజర్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఆయన, సంస్థ కార్యక్రమాల కోసం మందాకృష్ణ మాదిగను విస్సన్నపేటకు ఆహ్వానించి ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. సిండికేట్ బ్యాంకులో ఉద్యోగిగా సేవలందించిన ఆయన పదవీ విరమణ అనంతరం కూడా ప్రజాసేవను కొనసాగిస్తూ సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

ప్రజా సమస్యలపై రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి పనిచేసిన లాజర్ మృతి పేద ప్రజలకు తీరని లోటని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన డి. హరినాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజకీయాలు వేరైనా ప్రజా ప్రయోజనాల విషయంలో లాజర్‌తో కలిసి పనిచేసిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఆయన సేవలను కొనియాడారు.

గొర్రె లాజర్ మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీల నేతలు, సామాజిక సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పార్టీలకు అతీతంగా సంతాపం వ్యక్తం చేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.