BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

ప్రజల మధ్యలో ఎమ్మెల్యే కొలికపూడి.. సమస్యలు తెలుసుకుంటూ భరోసా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 11:02 AM
31 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో మార్నింగ్ వాకింగ్ చేస్తూ ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే

తిరువూరు, ఆగస్టు 22:

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో పర్యటించారు. శుక్రవారం ఉదయం తిరువూరు పట్టణంలో మార్నింగ్ వాకింగ్ చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు.

మార్గమధ్యంలో కలిసిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల వద్దకు వెళ్లి ‘‘ఏమైనా సమస్యలు ఉన్నాయా?’’ అంటూ నేరుగా వివరాలు సేకరించారు. ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.

అనంతరం పట్టణంలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికులను ఎమ్మెల్యే పలకరించారు. వారి కుటుంబ పరిస్థితులు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు.

ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులపై స్పష్టమైన అవగాహన వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.

ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.