BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ప్రకృతి వ్యవసాయం - వ్యవసాయ శాఖ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Apr, 2026 - 03:29 PM
145 వీక్షణలు

ప్రకృతి వ్యవసాయం - వ్యవసాయ శాఖ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం (APCNF) పై రైతు సేవ కేంద్రం సిబ్బందికి అవగాహన మరియు క్షేత్ర దర్శనం నిర్వహించారు.

మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మీ గారు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనాలు లేని ఆరోగ్యకరమైన జీవన శైలికి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలు తినడం ఎంత ముఖ్యమో వివరించారు. 0-20 సెంట్ల పొలంలో ATM (Any Time Money) విధానాన్ని అవలంబించి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మెంటర్ కె లక్ష్మీ గారి పొలాన్ని పరిశీలించారు. ఈ పొలంలో 5 సెంట్ల భూమిలో 15 రకాల మొక్కలు (కూరగాయలు, ఆకుకూరలు, పువ్వులు, పండ్ల మొక్కలు) పండించడం వలన రైతుకు సంవత్సరం పొడుగునా ఏదో ఒక పంట ద్వారా రాబడి వస్తుందని తెలిపారు. ఇతర రైతులు కూడా తమ భూమిలో కొన్ని సెంట్లు ఈ విధానాన్ని పాటించాలని రైతు సేవ కేంద్ర సిబ్బందికి సూచించారు.

ప్రకృతి వ్యవసాయం యూనిట్ ఇంచార్జ్ జి శ్రీనివాసరావు ద్రవ జీవామృతం, బీజామృతం మరియు విత్తన గుళికల తయారీ విధానాలు మరియు వాటి ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు సేవ కేంద్రం సిబ్బంది మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.