ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం
పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నక్కపల్లి మండలం దేవవరం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దేవర సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని సంరక్షించాల్సిన బాధ్యతను గుర్తు చేసే రోజు అని అన్నారు. కాలుష్యం, ప్లాస్టిక్ వినియోగం, అడవుల నరికివేత, వాతావరణ మార్పులు వంటి సమస్యలు భూమికి తీవ్ర ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వం, అధికారులు, ప్రజలు సమిష్టిగా కృషి చేసినప్పుడే ప్రకృతి సంక్షోభాన్ని అధిగమించగలమని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బత్తుల రమణబాబు, సూరిబాబు, తాతారావు, జనసేన నాయకుడు వెంకటరమణ, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు.