BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
09 Apr, 2026 - 04:53 PM
20 వీక్షణలు
ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయం--రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క 

విద్యార్థుల ఎదుగుదలే రాష్ట్ర ఎదుగుదల, వారి భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని రాష్ట్ర ఉప మఖ్యమంత్రి  మల్లు బట్టి విక్రమార్క అన్నారు మధిర నియోజకవర్గం, ఎర్రుపాలెం మండలం, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో  అమ్మ ఫౌండేషన్ సౌజన్యంతో ఉచితంగా విద్యార్థినులకు సైకిళ్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మల్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ఎదుగుదలే రాష్ట్ర ఎదుగుదల, వారి భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని పేర్కొన్నారు. విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖకు 13.5 శాతం నిధులు కేటాయించడం ఇందుకు నిదర్శనమన్నారు.గత పదేళ్లలో పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక భారం ఉన్నప్పటికీ డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచినట్లు తెలిపారు.మన సహజ వనరులతో పాటు మానవ వనరులను కూడా సమర్థంగా తీర్చిదిద్దేందుకు అవసరమైనన్ని నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు. విద్యార్థులు బాగా చదువుకుని రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల సమయాన్ని ఆదా చేయడం, వారికి శ్రమ తగ్గించడం లక్ష్యంగా అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా సైకిళ్లను అందజేస్తున్నట్లు తెలిపారు. సైకిళ్లు వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, సురక్షితంగా పాఠశాలలకు రాకపోకలు సాగించాలని సూచించారు.
విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారేందుకు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.