BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 09 April 2026, 04:53 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
09 Apr, 2026 - 04:53 PM
117 వీక్షణలు
ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయం--రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క 

విద్యార్థుల ఎదుగుదలే రాష్ట్ర ఎదుగుదల, వారి భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని రాష్ట్ర ఉప మఖ్యమంత్రి  మల్లు బట్టి విక్రమార్క అన్నారు మధిర నియోజకవర్గం, ఎర్రుపాలెం మండలం, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో  అమ్మ ఫౌండేషన్ సౌజన్యంతో ఉచితంగా విద్యార్థినులకు సైకిళ్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మల్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ఎదుగుదలే రాష్ట్ర ఎదుగుదల, వారి భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని పేర్కొన్నారు. విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖకు 13.5 శాతం నిధులు కేటాయించడం ఇందుకు నిదర్శనమన్నారు.గత పదేళ్లలో పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక భారం ఉన్నప్పటికీ డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచినట్లు తెలిపారు.మన సహజ వనరులతో పాటు మానవ వనరులను కూడా సమర్థంగా తీర్చిదిద్దేందుకు అవసరమైనన్ని నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు. విద్యార్థులు బాగా చదువుకుని రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల సమయాన్ని ఆదా చేయడం, వారికి శ్రమ తగ్గించడం లక్ష్యంగా అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా సైకిళ్లను అందజేస్తున్నట్లు తెలిపారు. సైకిళ్లు వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, సురక్షితంగా పాఠశాలలకు రాకపోకలు సాగించాలని సూచించారు.
విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారేందుకు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.