www.ntodaynews.com
ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్
/
వైఎస్ఆర్ కడప
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందులకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు కడప జిల్లాలో ఆయన పర్యటించనున్నారు.
పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మంగళవారం నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న జగన్, అనంతరం మధ్యాహ్నం బాక్రాపురంలో ప్రజా దర్బార్లో పాల్గొననున్నారు.
ఈ నెల 25న పర్యటన ముగించుకుని తిరిగి బెంగళూరుకు వెళ్లనున్నారు.