ఘనంగా పర్వతాపురంలో అంకమ్మ తల్లి విగ్రహ స్థాపన మహోత్సవం
ఘనంగా పర్వతాపురంలో అంకమ్మ తల్లి విగ్రహ స్థాపన మహోత్సవం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో శనివారం శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లి విగ్రహ స్థాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం (222/2019) వ్యవస్థాపక అధ్యక్షులు చలపాటి వెంకటేశ్వరరావు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అలాగే టీడీపీ మండల అధ్యక్షులు ఇజ్జగాని వెంకటేశ్వరరావు, గౌడ సంఘం ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు మదాసు చంద్రకళ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు చింత అనిల్ గౌడ్, విజయవాడ సిటీ అధ్యక్షులు వీరంకి రామచంద్రరావు, మాజీ సర్పంచ్ మిద్దె శివాజీ, మండల గౌడ సంఘం అధ్యక్షులు చింతకుంట్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఇంకా బోట్ల వీరేంద్ర, మిద్దె రామకృష్ణ, బూబత్తుల చెన్నారావు, బొర్రా నాగేశ్వరరావు, మాదాసు పుల్లయ్య, బొర్రా రామకృష్ణ, చీపు సాయి కృష్ణ, సాయి గౌడ్ తదితరులు హాజరయ్యారు. గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంకమ్మ తల్లి ఆశీస్సులు పొందారు. కార్యక్రమం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి పారవశ్యంతో సాగింది.