పసుమరు గ్రామంలో హెచ్ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
పసుమరు గ్రామంలో హెచ్ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం (దిశ) పర్యవేక్షణలో లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో 'మొబలైజ్ ఎయిడ్స్ సురక్ష' కార్యక్రమం నిర్వహించారు. చిలకలూరిపేట మండలం పసుమరు గ్రామంలోని వెంకట సురేష్ ఎంటర్ప్రైజెస్లో ఐఈసీ కార్యక్రమం ద్వారా ప్రజలకు హెచ్ఐవీ/ఎయిడ్స్, సుఖవ్యాధులు (సిఫిలిస్), మరియు హెపటైటిస్-బి వ్యాధులపై ఐసిటిసి కౌన్సిలర్ ఎం. హనుమంతరావు అవగాహన కల్పించారు. ఈ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, వాటి నివారణోపాయాలను వివరించారు.
అనంతరం గ్రామంలోని 43 మందికి ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ సూపర్వైజర్ మద్ది సురేష్, బి. నాగేశ్వరరావు, ఐసిటిసి ఎల్టీ వంశీ, క్లస్టర్ లింక్ వర్కర్ ఎం. మెర్సీ ఫ్లోరెన్స్, మరియు ఆశా కార్యకర్తలు జి. ఆదిలక్ష్మి, పి. మణి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.