BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
05 Jun, 2026 - 06:12 PM
43 వీక్షణలు

పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు

చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం (దిశ) పర్యవేక్షణలో లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో 'మొబలైజ్ ఎయిడ్స్ సురక్ష' కార్యక్రమం నిర్వహించారు. చిలకలూరిపేట మండలం పసుమరు గ్రామంలోని వెంకట సురేష్ ఎంటర్‌ప్రైజెస్‌లో ఐఈసీ  కార్యక్రమం ద్వారా ప్రజలకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్, సుఖవ్యాధులు (సిఫిలిస్), మరియు హెపటైటిస్-బి వ్యాధులపై ఐసిటిసి కౌన్సిలర్ ఎం. హనుమంతరావు అవగాహన కల్పించారు. ఈ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, వాటి నివారణోపాయాలను వివరించారు.

అనంతరం గ్రామంలోని 43 మందికి ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ సూపర్‌వైజర్ మద్ది సురేష్, బి. నాగేశ్వరరావు, ఐసిటిసి ఎల్టీ వంశీ, క్లస్టర్ లింక్ వర్కర్ ఎం. మెర్సీ ఫ్లోరెన్స్, మరియు ఆశా కార్యకర్తలు జి. ఆదిలక్ష్మి, పి. మణి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.