ద్రావిడ విశ్వవిద్యాలయం అభివృద్ధికి సలహాలు సూచనలు
ద్రావిడ విశ్వవిద్యాలయం అభివృద్ధికి సలహాలు సూచనలు
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పంలో ఎమెనో హౌస్లో నేడు ఉదయం 10.30 గంటలకు ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ప్లాన్ (IDP) పై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎల్. సి. మల్లయ్య గారు అధ్యక్షత వహించి విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ లా, నర్సింగ్ కోర్స్, సోషల్ వర్క్, సోషాలిటీ,ఎకనామిక్స్ ఇంకా కొన్ని కొత్త కోర్సులు ప్రారంభిస్తాం అన్నారు.
ఈ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తున్న ఆచార్య ఏ. సి. నారాయణ సంస్థ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ, భవిష్యత్ కార్యాచరణపై సూచనలు చేశారు.
సమావేశంలో కమిటీ సభ్యులైన ఆచార్య రాజగోపాల్ గారు, మం మాండ్యా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య శివచిత్తప్ప, చెన్నై ఐఐటి ప్రొఫెసర్ ఎన్ హరీష్ కుమార్ ద్రావిడ విశ్వవిద్యాలయం అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు తెలియజేశారు. విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఆచార్య కిరణ్ కుమార్ గారు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరునా స్టూడియో ప్రారంభిస్తామన్నారు.
ఈ సందర్భంగా ద్రావిడ విశ్వవిద్యాలయం అకాడమిక్ వ్యవహారాల డీన్ ఆచార్య శ్యామల ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ప్లాన్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమర్పించారు.
ఈ సమావేశంలో కొత్త యుజి (UG) మరియు పీజీ (PG) కోర్సుల ప్రారంభం పై సమావేశం లో విశ్వవిద్యాలయ అందరు ఆచార్యుల నుండి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. విశ్వవిద్యాలయం అభివృద్ధి దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ ఆచార్య కిరణ్ కుమార్ అన్ని శాఖలు డీన్ అండ్ హెడ్స్ అఫ్ ది డిపార్ట్మెంట్, డిప్యూటీ ఇంజనీర్ రఘుపతి మరియు సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.
డా.పి ఎస్ గణేష్ మూర్తి పి.ఆర్.ఓ
ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం