నిద్దరలోనే నలుగురు ప్రాణాలు పోయాయి..
ద్విచక్ర వాహనం బోర్ చేయించు కొని రాత్రి ఇంటిలో బండి స్టార్టింగ్ లో పెట్టి మరచిపోయి నిద్రపోవడం తో నలుగురు మృతి చెందిన ఘటన త్యాగరాజు వీధిలో చోటుచేసుకోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే...
పుంగనూరు పట్టణం త్యాగరాజు వీధి కి చెందిన రామచంద్రప్ప (75) తన కుమారుడు మురళి, భార్య రేవతి లకు నలుగురు సంతానం మొదటి సంతానం బిందు (13) శనివారం సదుం లో తన అమ్మామ్మవారి ఇంటికి వెళ్లగా మురళి తన( సీటి 100)ద్విచక్ర వాహనం బోర్ కి వచ్చిందని రాత్రి రిపేర్ చేయించుకొని ఇంటికి తీసుకు వచ్చాడు.భోజనం తరువాత బండి కొద్దీ సేపు స్టార్టింగ్ లో పెట్టమని మెకానిక్ చెప్పాడని మురళి తన నివాసం లో ద్విచక్ర వాహనం ను స్టార్టింగ్ లో పెట్టి ఇంటి మిద్ది పై తాను తన భార్య రూమ్ లో నిద్రపోయారు. క్రింద ఇంటిలో నిద్రిస్తున్న తన తండ్రి రామచంద్రప్ప(75) మురళి కుమారుడు కార్తీక్ (13)కవలలు ఐన కుమార్తెలు చందన (7)చరత (7)లు నిద్రలో ద్విచక్ర వాహనం నుండి వెలుబడిన కార్బన్ డై ఆక్సడ్ వాయువు ఇంటిలో వ్యాపించి నిద్రలోనే నలుగురు మృతి చెందారు.ఉదయం నాలుగు గంటల ప్రాంతం లో పొగ వ్యాపించడం తో కుమారుడు మురళి ఇంటి తలుపులు తట్టిన తండ్రి తీయక పోవడం తో తలుపులు తెరచి చూడగా విఘత జీవులయి పడి వున్న తన కుటుంబాన్ని చూసి బోరున దంపతుల అర్థనాదాలతో వీధిలో ఇరుగు పొరుగు వారు చేరుకొని ఒక్కసారిగా చుట్టూ విషాద ఛాయలు అలుమూకొన్నాయి.పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.