BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

అంబేద్కర్ సర్కిల్‌లో దళిత సంఘాల నివాళులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 07:41 AM
98 వీక్షణలు

మిద్దింటి వెంకటస్వామి 6వ వర్ధంతి ఘనంగా నిర్వహణ

అంబేద్కర్ సర్కిల్‌లో దళిత సంఘాల నివాళులు

పుంగనూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మిద్దింటి వెంకటస్వామి 6వ వర్ధంతి కార్యక్రమాన్ని MRPS, MSP మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

దళిత నేత, అంబేద్కర్ ఆశయ సాధకుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని వెంకటస్వామి సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా MSP పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి బి. నరసింహులు, మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్, టీడీపీ నాయకుడు రామయ్య, ఏపీ దళిత సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు శంకరప్ప, AITUC నాయకుడు వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ... మిద్దింటి వెంకటస్వామి అణగారిన వర్గాలకే కాకుండా బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని కొనియాడారు.

ఆయన ఎవరికైనా అన్యాయం జరిగితే ముందుండి పోరాడి న్యాయం చేయించిన వ్యక్తి అని, ఆయన మరణం సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సామాజిక న్యాయ సిద్ధాంతాలను అమలు చేయడానికి జీవితాంతం కృషి చేసిన నేతగా ఆయనను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మిద్దింటి వెంకటస్వామి కుమారుడు పృథ్వీ కుమార్, దళిత సంఘాల నాయకులు రాజా, MEF జిల్లా నాయకుడు బోయకొండ శంకర్, MSP నాయకులు మాతంగి నాగభూషణం, ముత్యాల వెంకటరమణ (చిట్టి), చౌడేపల్లి మండల ఇన్చార్జ్ గోవిందు రెడ్డి, మహేష్, నారాయణ, నరసింహులు, గంగరాజు, సుబ్రహ్మణ్యం, రాజు తదితరులు పాల్గొన్నారు.