BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

అంబేద్కర్ సర్కిల్‌లో దళిత సంఘాల నివాళులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 07:41 AM
51 వీక్షణలు

మిద్దింటి వెంకటస్వామి 6వ వర్ధంతి ఘనంగా నిర్వహణ

అంబేద్కర్ సర్కిల్‌లో దళిత సంఘాల నివాళులు

పుంగనూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మిద్దింటి వెంకటస్వామి 6వ వర్ధంతి కార్యక్రమాన్ని MRPS, MSP మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

దళిత నేత, అంబేద్కర్ ఆశయ సాధకుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని వెంకటస్వామి సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా MSP పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి బి. నరసింహులు, మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్, టీడీపీ నాయకుడు రామయ్య, ఏపీ దళిత సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు శంకరప్ప, AITUC నాయకుడు వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ... మిద్దింటి వెంకటస్వామి అణగారిన వర్గాలకే కాకుండా బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని కొనియాడారు.

ఆయన ఎవరికైనా అన్యాయం జరిగితే ముందుండి పోరాడి న్యాయం చేయించిన వ్యక్తి అని, ఆయన మరణం సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సామాజిక న్యాయ సిద్ధాంతాలను అమలు చేయడానికి జీవితాంతం కృషి చేసిన నేతగా ఆయనను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మిద్దింటి వెంకటస్వామి కుమారుడు పృథ్వీ కుమార్, దళిత సంఘాల నాయకులు రాజా, MEF జిల్లా నాయకుడు బోయకొండ శంకర్, MSP నాయకులు మాతంగి నాగభూషణం, ముత్యాల వెంకటరమణ (చిట్టి), చౌడేపల్లి మండల ఇన్చార్జ్ గోవిందు రెడ్డి, మహేష్, నారాయణ, నరసింహులు, గంగరాజు, సుబ్రహ్మణ్యం, రాజు తదితరులు పాల్గొన్నారు.