BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

అంబేద్కర్ సర్కిల్‌లో దళిత సంఘాల నివాళులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 07:41 AM
23 వీక్షణలు

మిద్దింటి వెంకటస్వామి 6వ వర్ధంతి ఘనంగా నిర్వహణ

అంబేద్కర్ సర్కిల్‌లో దళిత సంఘాల నివాళులు

పుంగనూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మిద్దింటి వెంకటస్వామి 6వ వర్ధంతి కార్యక్రమాన్ని MRPS, MSP మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

దళిత నేత, అంబేద్కర్ ఆశయ సాధకుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని వెంకటస్వామి సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా MSP పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి బి. నరసింహులు, మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్, టీడీపీ నాయకుడు రామయ్య, ఏపీ దళిత సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు శంకరప్ప, AITUC నాయకుడు వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ... మిద్దింటి వెంకటస్వామి అణగారిన వర్గాలకే కాకుండా బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని కొనియాడారు.

ఆయన ఎవరికైనా అన్యాయం జరిగితే ముందుండి పోరాడి న్యాయం చేయించిన వ్యక్తి అని, ఆయన మరణం సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సామాజిక న్యాయ సిద్ధాంతాలను అమలు చేయడానికి జీవితాంతం కృషి చేసిన నేతగా ఆయనను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మిద్దింటి వెంకటస్వామి కుమారుడు పృథ్వీ కుమార్, దళిత సంఘాల నాయకులు రాజా, MEF జిల్లా నాయకుడు బోయకొండ శంకర్, MSP నాయకులు మాతంగి నాగభూషణం, ముత్యాల వెంకటరమణ (చిట్టి), చౌడేపల్లి మండల ఇన్చార్జ్ గోవిందు రెడ్డి, మహేష్, నారాయణ, నరసింహులు, గంగరాజు, సుబ్రహ్మణ్యం, రాజు తదితరులు పాల్గొన్నారు.