ఉయ్యాల రమణ గృహప్రవేశానికి హాజరైన కూటమి నాయకులు
ఉయ్యాల రమణ గృహప్రవేశానికి హాజరైన కూటమి నాయకులు
పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణ ఆహ్వానం మేరకు ఆయన నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి పుంగనూరు మండల టీడీపీ, జనసేన పార్టీ నాయకులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వారిలో టీడీపీ నాయకుడు మాధవ రెడ్డి, జనసేన పుంగనూరు మండల అధ్యక్షుడు విరూపాక్షి, రాష్ట్ర TNTUC కార్యదర్శి జెల్లీ మనోహర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యుడు చైతన్య రాయల్, జనసేన పట్టణ అధ్యక్షుడు నరేశ్ రాయల్, క్లస్టర్ ఇంచార్జి గంగాధర్, మాజీ సర్పంచ్ రమణ, PACS డైరెక్టర్ కోలాట రమణ, కో-క్లస్టర్ ఇంచార్జి హరి, జనసేన మండల ప్రధాన కార్యదర్శి హరి నాయక్, మంగళం పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు మాధవ, జనసేన మండల కార్యదర్శి బాలాజీ నాయక్ తదితరులు ఉన్నారు.
అలాగే కూటమి నాయకులు రాంబాబు, పవన్ కుమార్, జనార్దన్ రాయల్, శ్రీరాములు, మహేంద్ర రాయల్, కృష్ణబాబు, బాబు నాయక్ మరియు ఇతరులు పాల్గొని ఉయ్యాల రమణకు శుభాకాంక్షలు తెలిపారు.