www.ntodaynews.com
శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయంలో ప్రతి ఏడాది నిర్వహించే ఆవుల పరస 1,49,000పాడి దక్కించుకున్నారు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పుంగనూరు పట్టణంలోని శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయంలో ప్రతి ఏడాది నిర్వహించే ఆవుల పరస 1,49,000 పాడి దక్కించుకున్నారు
పుంగనూరు పట్టణంలోని శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయంలో ప్రతి ఏడాది నిర్వహించే ఆవుల పరసకు సోమవారం వేలంపాట నిర్వహించారు. ఆలయ ఈవో, ఉప కమిషనర్ ఏకాంబరం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంపాటలో పట్టణానికి చెందిన గంగాధర్ రూ.1,49,000కు పాడి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో ఏకాంబరం మాట్లాడుతూ శ్రీ మాణిక్య వరదరాజ స్వామి రథోత్సవానికి అనుబంధంగా ప్రతి ఏడాది ఆవుల పరస నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. పాటదారులు నిబంధనల ప్రకారం సక్రమంగా ఆవులు పరసను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శశికుమార్, ఆలయ సిబ్బంది లత, అర్చకులు కృష్ణ దీక్షితులు, పాటదారులు పాల్గొన్నారు.