పుంగనూరులో దోమల వ్యాధులపై అవగాహన ర్యాలీ.. మలేరియా అంతం-మన పంతం: సిబ్బంది ప్రతిజ్ఞ
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో గల తూర్పుమొగసాల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మలేరియా వ్యతిరేక మాసోత్సవములు సందర్భంగా 'మలేరియా అంతం - మన అందరి పంతం మనం సాధించగలం' అనే నినాదంతో ర్యాలీ... అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా మలేరియా అధికారుల ఆదేశముల మేరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు కార్యక్రమమును పురస్కరించుకుని దోమల ద్వారా వ్యాపించు వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ సందర్భంగా వైద్యాధికారిని కుమారి డాక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ.. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, మెదడు వాపు వ్యాధి, బోధకాలువ్యాధి వంటి వాటిపై వైద్య సిబ్బంది నిరంతరం ప్రజలకు, దోమలు ద్వారా వచ్చే వ్యాధులుపైన అవగాహన కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలని సూచించారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమము ద్వారా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజలతో మమేకమై "ఇప్పుడు మనం సాధించగలం-ఇప్పుడు మనం తప్పక సాధించాలి" అనే లక్ష్యంతో సిబ్బంది ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. దోమలను లార్వా దశ లో నాశనం చేయడం సులభం అని, దోమ తెరల వాడకం గురించి, నీటి నిల్వలను సకాలంలో తొలగించడం అనగా "ఫ్రైడే డ్రైడే" పైన అవగాహన కల్పించారు. లార్వాలను నిర్మూలించే క్రిమిసంహారక మందులను వైద్య సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు పంపిణీ చేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన 'ప్రతిజ్ఞ' ను చదివి సిబ్బంది అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని డాక్టర్ కిరణ్మయి, పుంగనూరు మలేరియా సబ్ యూనిట్ అధికారి G. గంగయ్య మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పి సోమశేఖరాచారి, ఏఎన్ఎమ్ లు, ఆశా కార్యకర్తలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.