www.ntodaynews.com
పుంగనూరులో ఉచిత కంటి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పుంగనూరులో ఉచిత కంటి పరీక్షలు
పుంగనూరు పట్టణం తాటిమాకులపాళ్యంలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. వివిధ రకాల కంటి జబ్బులతో ఇబ్బంది పడుతున్న వారు పరిసర ప్రాంత గ్రామాల నుంచి శిబిరానికి హాజరయ్యారు. డాక్టర్ మురళీకృష్ణ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. తర్వాత కంటి సంరక్షణ గురించి తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.